పోచమ్మ బోనాల జాతరలో బోనంతో పాటు ప్లకార్డులతో నిరసన తెలిపిన మహిళ రైతులు..
ల్యాండ్ బ్యాంక్ కు రెండు పంటలు పండే వ్యవసాయ భూములు ఇవ్వం అంటూ నినాదాలతో మారుమోగిన బోనాల జాతర.
అరేపల్లి, పైడిపల్లి గ్రామ రైతులకు మద్దతుగా ఈ రోజు అరేపల్లిలో మహిళలు బోనాలతో నిరసన తెలిపారు..
వరంగల్ జిల్లా అరేపల్లిలో గత వారం రోజులుగా ప్రైవేట్ వ్యక్తులు KUDA పేరుతో భూములు లాక్కోవాలని చేసిన దొంగ సర్వే కు వ్యతిరేకంగా ఆరేపల్లి, పైడిపల్లి రైతులు ఉద్యమిస్తున్నారు. అందులో భాగంగా నేడు ఆరేపల్లి, పైడిపల్లిలో పోచమ్మ బోనాలు సందర్భంగా మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పోచమ్మతల్లి బోనాల సందర్భంగా మహిళలు బోనంతో పాటు మా భూముల జోలికి ఎవరు రావద్దని, ల్యాండ్ బ్యాంక్ కు వ్యవసాయ భూములు ఇవ్వం అని, దొంగా సర్వేలు ఆపి రైతులకు న్యాయం చేయాలని ప్లే కార్డులతో వినూత్న నిరసన తెలిపారు.
బోనాల జాతరలో అధికారులు పేరుతో దొంగ సర్వేలు చేసిన వారికి బుద్ది మారాలని, మా వ్యవసాయ భూముల జోలికి ఎవరు రావద్దని, రెండు పంటలు పండే భూములను ఎవరికి ఇవ్వం అని ప్లే కార్డులు చేతపట్టుకొని, నెత్తిమీద బోనంతో రైతులకు మద్దతుగా మహిళలు సంఘీభావం చెప్పారు.
అరేపల్లిల్లో ప్రతియేడాది పోచమ్మ బోనాలను ప్రత్యేకంగా జరిపే గొల్ల, కురుమలు ఈ ఏడాది నిరసనలతో బోనం సమర్పించారు. ఎప్పుడు డప్పు చప్పుళ్ళు మధ్య వెళ్లే బోనాలు, ఈ రోజు మాత్రం భూములు లాక్కోవాలని చూసిన వారికి బుద్ది రావాలని నినాదాలు చేస్తూ ,ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఈ బోనాల ర్యాలీ సాగింది..
కోరే అనూష, జక్కుల సమ్మక్క, అమ్మ రామ, కోరే రజిత, నర్సింగుల వెన్నెల, మద్ది జయ, మద్ది రామ, పొగాకు వసంత, కోరే లక్ష్మీ, మండల మీనాక్షి, మామిడి కట్టమ్మ, బుర్రి కొమురమ్మ , కుక్కల కట్టక్క, అమ్మ నిలా, కాడబోయిన స్వప్న, యార సునీత, మెరుగు లక్ష్మీ, బత్తిని కేతమ్మ, బత్తిని బుచ్చమ్మ, ఎల్లవుల లక్ష్మీ, గౌడ రామ, గౌడ కళావతి, దయ్యాల స్వప్న, దయ్యాల సమ్మక్క, మమత, ఎల్లమ్మ, తదితర మహిళలు, గ్రామ రైతులు పాల్గొన్నారు.